
బెంగుళూర్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటిదార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో కేవలం 30 ఇన్నింగ్స్ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశాడు. శుక్రవారం (ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పటిదార్ ఈ ఫీట్ నెలకొల్పాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డ్ను పటిదార్ బద్దలుకొట్టాడు.
ఐపీఎల్లో సచిన్ 31 ఇన్నింగ్స్లలో 1000 పరుగులు పూర్తి చేయగా.. పటిదార్ 30 ఇన్సింగ్స్ల్లోనే ఈ మైలురాయి అందుకుని మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్ను బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండవ భారతీయుడిగా పటిదార్ నిలిచాడు.
పటిదార్ కంటే ముందు గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఉన్నాడు. సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్సింగ్స్ల్లోనే 1000 రన్స్ పూర్తి చేశాడు. అయితే, ఐపీఎల్ చరిత్రలో 35 కంటే ఎక్కువ సగటు, 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 1000 పరుగులు సాధించిన మొదటి భారతీయ బ్యాట్స్మన్ మాత్రం పటిదారే.
ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) కెప్టెన్గా ఈ ఏడాది రజత్ పటిదార్ నియామకమైన విషయం తెలిసిందే. ఆర్సీబీ యజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పటిదార్ నిలబెట్టుకుంటున్నాడు. కెప్టెన్సీతో పాటు ఇటూ బ్యాటింగ్లో రాణిస్తూ ఆర్సీబీ విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆరు ఇన్సింగ్స్ల్లో 157 స్ట్రైక్ రేట్తో 209 రన్స్ చేశాడు.
ఇక, పటిదార్ కెప్టెన్సీలో ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన ఆర్సీబీ నాలుగు విజయాలు సాధించి.. మూడింట్లో ఓటమి పాలైంది. ప్రత్యర్థి వేదికలపై విజయాలు సాధించిన ఆర్సీబీ.. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచుల్లో ఓటమి పాలుకావడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆర్సీబీ గెలిచిన నాలుగు మ్యాచులు కూడా ప్రత్యర్థుల హోంగ్రౌండ్లోనే కావడం విశేషం.
కాగా, ఐపీఎల్18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వింతగా ఆడుతోంది. ప్రత్యర్థి వేదికల్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆర్సీబీ సొంతగడ్డపై ఇంకా గెలుపు రుచి చూడలేకపోయింది. చిన్నస్వామి స్టేడియంలో మూడో పోరులోనూ ఆ జట్టు పల్టీ కొట్టింది. శుక్రవారం (ఏప్రిల్ 18) రాత్రి వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ పెర్ఫామెన్స్తో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించి ఐదో విజయం ఖాతాలో వేసుకుంది.