
న్యూఢిల్లీ: బీహార్ నుంచి జేడీయూ తరఫున రెండోసారి రాజ్యసభ ఎంపీగా సేవలందిస్తున్న రామ్నాథ్ ఠాకూర్కు కేంద్ర మంత్రి పదవి వరించింది. కొన్ని నెలల కిందే రామ్ నాథ్ ఠాకూర్ తండ్రి దివంగత కర్పూరి ఠాకూర్కు ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న ప్రకటించింది. నాయీ కమ్యూటీకి చెందిన 73 ఏండ్ల రామ్ నాథ్ ఠాకూర్.. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రంలో ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్లు 1.57 శాతం మంది ఉన్నారు. నాయీ కమ్యూనిటీ ఈబీసీ కేటగిరి కిందికి వస్తుంది. రాష్ట్రంలో వీరి జనాభా 36.01 శాతం ఉంది. కర్పూరి ఠాకూర్కు భారతరత్న అనౌన్స్ చేశాక.. ఆయన ఫ్యామిలీతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జేడీయూ నుంచి మొత్తం ఆరుగురికి మంత్రి పదవులు దక్కాయి.