బ్లాక్​మెయిల్​ రాజకీయాలకు బెదరం : ​గూటోజు కిష్టయ్య

బ్లాక్​మెయిల్​ రాజకీయాలకు బెదరం : ​గూటోజు కిష్టయ్య

రేగొండ, వెలుగు: భూపాలపల్లి జిల్లాలో బీఆర్​ఎస్​ బ్లాక్​ మెయిల్​రాజకీయాలకు భయడమని భూపాలపల్లి మార్కెట్​కమిటీ చైర్మన్​గూటోజు కిష్టయ్య పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్​భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. తమ పార్టీ తరుఫున సంక్షేమ పథకాల పేర్లను వాల్​ రైటింగ్​వేస్తున్న పెయింటర్​ దార్ల ఓంశంకర్​ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం బెదిరింపులకు గురి చేయడం సిగ్గు చేటన్నారు.

తమ పార్టీ పెయింటర్ రిజర్వు చేసిన గోడలకు బీఆర్​ఎస్​ ప్రచార రైటింగ్​వేయడమే కాకుండా సోషల్​ మీడియాలో అసత్యపు ప్రచారం చేయడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికైనా గుండా రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్​ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, నాయకులు బొజ్జం రవి, మూల్కనూరి భిక్షపతి, జంగటి సుధాకర్, మేకల భిక్షపతి, పున్నం రవి తదితరులు పాల్గొన్నారు. ​