![గుడ్ న్యూస్ : టెన్త్ పాసైతే చాలు.. రైల్వేలో ఉద్యోగం..](https://static.v6velugu.com/uploads/2025/02/apply-online-for-32438-group-d-level-1-posts_D9YjscXHlB.jpg)
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 32,438 గ్రూప్–డి లెవల్–1 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్ బీ) నోటిఫికేషన్ జారీ చేసింది. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లకు ఈ నెల 23వ తేదీ ఆఖరు.
పోస్టులు (32,438): ట్రాక్ మెయింటెయినర్గ్రూప్–4 – 13,187, పాయింట్స్ మెన్ – 5,058, అసిస్టెంట్(వర్క్ షాప్) – 3077, సిస్టెంట్(సి అండ్డబ్ల్యూ)–2587, అసిస్టెంట్ టీఎల్అండ్ ఏసీ–1041, అసిస్టెంట్ లోక్షెడ్–950, అసిస్టెంట్ ఆపరేషన్స్(ఎలక్ట్రికల్)–744, అసిస్టెంట్టీఎల్అండ్ఏసీ(వర్క్ షాప్)–625, అసిస్టెంట్(ట్రాక్ మెషిన్)–799, అసిస్టెంట్పీ–వే–247, అసిస్టెంట్ లోకోషెడ్(డీజిల్)–420, అసిస్టెంట్(ఎల్అండ్సీ)–2012, అసిస్టెంట్ టీఆర్ డీ–1381.ఆర్ఆర్బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, కోల్కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్రాజ, రాంచీ, సికింద్రాబాద్.
ఎలిజిబిలిటీ: పదో తరగతి లేదా ఐటీ డిప్లొమా, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటీస్సర్టిఫికెట్(ఎన్ఏసీ), సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. 2025, జులై 1 నాటికి 18 నుంచి 36 ఏండ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.