ఏప్రిల్ 21న ఇందూర్​కు ముగ్గురు మంత్రుల రాక

ఏప్రిల్ 21న  ఇందూర్​కు ముగ్గురు మంత్రుల రాక

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌లో 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవానికి గిరిరాజ్​ డిగ్రీ కాలేజీ గ్రౌండ్​ సిద్ధమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభ కార్యక్రమానికి   మంత్రులు ఉత్తమ్‌‌‌‌కుమార్​రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు, జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు. వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. హార్టికల్చర్​, వెటర్నరీ, ఫిషరీస్​ డిపార్ట్​మెంట్లు కూడా ఇందులో భాగం పంచుకుంటున్నాయి. 

నేటి ప్రజావాణి రద్దు

రైతు మహోత్సవం, ముగ్గురు మంత్రుల రాక నేపథ్యంలో సోమవారం ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్​ రాజీవ్​గాంధీ తెలిపారు. ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.