చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్స్ కి రూ. 5లక్షలు విరాళం అందించిన సాయి గుర్గ తేజ్.

చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్స్ కి రూ. 5లక్షలు విరాళం అందించిన సాయి గుర్గ తేజ్.

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 29న టాలీవుడ్ ప్రముఖ హీరో సాయి గుర్గ తేజ్ తన కుటుంబంతో కలసి హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన సోదరుడు వైష్ణవ్ తేజ్ మరియు తల్లి విజయ దుర్గతో కలసి గుండె సంబందిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులతో సంతోషంగా గడిపారు. ఈ క్రమంలో చిన్నారులతో కబుర్లు చెబుతూ ఫోటోలు దిగుతూ చిన్నారులను ఖుషీ చేశారు. 

సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ చిన్నారుల గుండె సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించాడు. అలాగే తనవంతుగా ఫౌండేషన్ అధికారులకి దాదాపుగా రూ.5 లక్షలు విరాళం అందించాడు. అలాగే భవిష్యత్ లో ఎలాంటి సహాయం కావాలన్నా తనని సంప్రదించమని భరోసా ఇచ్చాడు.

ALSO READ | సత్యం సుందరం టీమ్ కి అభినందనలు తెలిపిన హీరో నాగార్జున.

ఈ విషయం ఇలా ఉండగా సాయి దుర్గ తేజ్ చివరగా బ్రో చిత్రంలో నటించాడు. కాగా ఈ చిత్రానికి తమిళ్ దర్శకుడు మరియు నటుడు సముద్రఖని దర్శకత్వం వహించగా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రలో నటించాడు. కానీ ఈ చిత్రం ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోయింది. దీంతో సాయి దుర్గ తేజ్ తన నెక్ట్స్ సినిమా స్క్రిప్ట్ పై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోనున్నాడు.