ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా మరోసారి శామ్ పిట్రోడా

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా మరోసారి శామ్ పిట్రోడా

న్యూఢిల్లీ: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్  చైర్మన్​గా శామ్ పిట్రోడాను కాంగ్రెస్ పార్టీ మరోసారి నియమించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకం చేపట్టినట్టు ఏఐసీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. శామ్ పిట్రోడా నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, తూర్పు భారతీయులు చైనీయులను పోలి ఉంటారని, దక్షిణాదిలో ఉన్నవారు ఆఫ్రికన్ లా కనిపిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇటీవల పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. తాజాగా మరోసారి ఆయనను ఆ పదవిలోనే నియమించారు.