పీవీకే- 5 ఇంక్లైన్​లో ఎల్​హెచ్​డీలను ఏర్పాటు చేయాలి : సింగరేణి కాలరీస్​ వర్కర్స్​

పీవీకే- 5 ఇంక్లైన్​లో ఎల్​హెచ్​డీలను ఏర్పాటు చేయాలి : సింగరేణి కాలరీస్​ వర్కర్స్​
  • స్ట్రక్చరల్​ మీటింగ్​లో వర్కర్స్​ యూనియన్​ నేతలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పీవీకే– 5 ఇంక్లైన్​లో రెండు కొత్త ఎల్​హెచ్​డీ  మెషీన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ నేతలు యాజమాన్యాన్ని కోరారు. కొత్తగూడెం ఏరియాలోని జీఎం కాన్ఫరెన్స్​ హాల్​లో యూనియన్​ నేతలతో సింగరేణి ఆఫీసర్లు సోమవారం నిర్వహించిన స్ట్రక్చరల్​ మీటింగ్​లో పలు అంశాలను నాయకులు ఆఫీసర్ల దృష్టికి తీసుకువచ్చారు. జేవీఆర్​ ఓసీలోని బంకర్ల పగుళ్లపై చర్చించారు. 

రుద్రంపూర్​ హైవేపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సర్ఫేస్​ జనరల్​ మజ్దూర్ల పోస్టులను కల్పించాలన్నారు. మహిళా ఉద్యోగులకు రెస్ట్​ రూం, వాష్​ రూం వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో జీఎం షాలెం రాజు, వర్కర్స్​ యూనియన్​ నేతలు మల్లికార్జునరావు, గట్టయ్య, సుధాకర్​తో పాటు పలువురు ఆఫీసర్లు పాల్గొన్నారు.