
ములుగు శివారు మేడివాగు దగ్గర ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో వెళ్తున్న ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఎన్నికల విధులు ముగించుకొని క్యాంపుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులందరూ కామారెడ్డి, ఖమ్మంకి చెందిన వారే కావడం గమనార్హం. క్షతగాత్రులందరిని అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.