తెలంగాణలో నాలుగు రైళ్ల పొడిగింపు..ఈ స్టేషన్లలో కూడా ఆగుతాయి

తెలంగాణలో నాలుగు రైళ్ల పొడిగింపు..ఈ స్టేషన్లలో కూడా ఆగుతాయి

తెలంగాణలో నడిచే నాలుగు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది.  మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఒక  ప్యాసింజర్‌ రైలును పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.  ఈ రైళ్ల పొడిగింపు అక్టోబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

పొడిగించిన రైళ్లు ఇవే..

  •  జైపూర్‌ నుంచి కాచిగూడ వరకు నడుస్తున్న జైపూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (919713/19714)ను ఏపీలోని కర్నూలు  వరకు పొడిగించారు.  ఈ రైలు తెలంగాణలోని గద్వాల, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌ లోనూ ఆగనుంది. 
  • హైదరాబాద్‌- హడప్సర్‌ (పూణె) ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు (17013/17014) భువనగిరి, జనగామ మీదుగా కాజీపేట వరకు పొడిగించారు.
  •  హెచ్‌ఎస్‌ నాందేడ్‌ - తాండూరు - పర్భణీ  ఎక్స్‌ప్రెస్‌ రైలు(17664/17663)ను సేడం, యాద్గిర్‌ మీదుగా రాయచూరు వరకు పొడిగించారు
  •  కరీంనగర్‌ - నిజామాబాద్‌ మధ్య నడిచే - కరీంనగర్‌  ప్యాసింజర్‌ (07894/07893)ను బోధన్‌ వరకు పొడిగించారు. 

ALSO READ : అక్టోబర్ 14 వరకు..ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..

ఈ పొడిగింపులు  అక్టోబర్ 9 2023 నుండి అమలులోకి వస్తాయి. అక్టోబర్ 8వ తేదీ ఆదివారం నుంచి పొడిగించిన  రైలు సర్వీసుల ముందస్తు రిజర్వేషన్ బుకింగ్ మొదలైంది.  అక్టోబర్ 9వ తేదీన  సికింద్రాబాద్‌ స్టేషన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ రైళ్ల పొడిగింపును ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.