
- ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ రాజేశ్చంద్ర
ఎల్లారెడ్డి, వెలుగు: పోలీసులు ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. శనివారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి, అనుమానితులను ఆరా తీయాలన్నారు.
సీసీ కెమెరాలను పరిశీలించి, మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్ రావు, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవీంద్ర నాయక్ , సదాశివ నగర్ సీఐ సంతోశ్కుమార్, ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్, తాడ్వాయి ఏఎస్సై కొండల్ రెడ్డి
పాల్గొన్నారు.