- డబుల్ ఇండ్ల కాంపౌండ్లోనే పెట్టేందుకు సన్నాహాలు
- 120 మంది స్టూడెంట్స్ కు దగ్గరలో పాఠశాల లేక ఇబ్బందులు
- ప్రైమరీ స్కూల్కు ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగారెడ్డి విద్యాశాఖాధికారులు
- రెండ్రోజుల్లో కలెక్టర్ వద్దకు ఫైల్ పర్మిషన్ రాగానే ఓపెనింగ్
హైదరాబాద్ సిటీ/సంగారెడ్డి:మూసీ రివర్ బెడ్ నుంచి కొల్లూరులోని డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళ్లిన నిర్వాసితుల పిల్లల కోసం డబుల్ ఇండ్ల పరిసరాల్లోనే ప్రభుత్వ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డబుల్ఇండ్లకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు దూరం ఉండడంతో పేరెంట్స్తమ పిల్లలను బడులకు పంపించడానికి భయపడుతున్నారు. అలాగే, మూసీ నిర్వాసితులు కొల్లూరులోని డబుల్ఇండ్లకు వెళ్లడంతో అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో వారికి అనుగుణంగా ఉండేలా అధికారులు డబుల్ఇండ్ల దగ్గరే ప్రైమరీ స్కూల్ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో స్కూల్ ఏర్పాటు చేస్తే, ప్రైవేట్స్కూళ్లకు పంపేవారు కూడా కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ స్కూల్లో చేర్పిస్తారని అధికారులు భావిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో ఫేజ్–1, ఫేజ్–2 లో దాదాపు 15,600 డబుల్ ఇండ్లను నిర్మించారు. డబుల్ టౌన్షిప్వద్ద ప్రత్యేకంగా స్కూళ్లు, పోలీస్ స్టేషన్, సబ్స్టేషన్తదితర వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీలు ఆచరణకు నోచుకోలేదు. ఈ డబుల్ ఇండ్లలో ఇదివరకు 800 కుటుంబాలకు పైగా నివాసం ఉండేవారు. మిగతా ఇండ్లు ఖాళీగా ఉండగా, ప్రస్తుతం మూసీ నిర్వాసితులకు ఆ ఇండ్లను కేటాయిస్తున్నారు. త్వరలో మిగతా ఇండ్లను కూడా లబ్ధిదారులకు కేటాయించే అవకాశం ఉంది.
120 మంది స్టూడెంట్స్ గుర్తింపు
మూసీ సుందరీకరణలో భాగంగా రివర్బెడ్ప్రాంతంలో ఉన్న ఇండ్లను ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. రివర్ బెడ్నిర్వాసితులకు సిటీ సమీపంలోని డబుల్బెడ్రూం ఇండ్లను కేటాయించింది. అలాగే, నిర్వాసితులకు ఉపాధి కల్పించడంతో పాటు, వారి పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్సర్కారు హామీ ఇచ్చింది. అందులో భాగంగా అధికారులు...నిర్వాసితులు ఉంటున్న డబుల్బెడ్రూం ఇండ్లలో సర్వే నిర్వహించారు. చదువుకునే పిల్లల్ని గుర్తించి సమీప స్కూళ్లలో జాయిన్ చేయిస్తున్నారు. అయితే, కొల్లూరులోని డబుల్ బెడ్రూం ఇండ్లలో జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వే నిర్వహించగా 120 మందికి పైగా పిల్లలున్నట్లు గుర్తించారు. వారి కోసం డబుల్ ఇండ్ల అపార్టుమెంట్ కిందే ప్రైమరీ స్కూల్ నిర్వహించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో ప్రతిపాదనలను కలెక్టర్ కు పంపనున్నారు. ఆయన నుంచి పర్మిషన్రాగానే సాధ్యమైనంత తొందరగా స్కూల్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ స్కూల్ అందుబాటులో వస్తే... తమ పిల్లల్ని బయటకు పంపకుండా ప్రభుత్వ స్కూళ్లలోనే జాయిన్ చేయిస్తామని నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.