సంక్షేమానికి కేరాఫ్​గా సీఎం పాలన : పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​చైర్మన్​ గురునాథ్​రెడ్డి

సంక్షేమానికి కేరాఫ్​గా సీఎం పాలన : పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​చైర్మన్​ గురునాథ్​రెడ్డి

కొడంగల్, వెలుగు: సంక్షేమానికి కేరాఫ్​అడ్రస్​గా సీఎం రేవంత్​రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని స్టేట్ పోలీస్​ హౌసింగ్​కార్పొరేషన్​చైర్మన్​గురునాథ్​రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్​మండంలోని రావులపల్లి, కస్తూర్​పల్లి, ఇందనూర్​గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీని ఆయన ప్రారంభించారు. 

దేశంలో పేదలకు సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ది జోడెద్దుల్లా పరుగులు తీస్తున్నాయన్నారు. సన్న బియ్యం పథకం సీఎం రేవంత్​రెడ్డి పేదలకు అందిస్తున్న వరమని కొనియాడారు.