
- కర్నాటక నుంచి నలుగురు, ఏపీ నుంచి ఒకరు ట్రాన్స్ఫర్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, కర్నాటక, ఏపీ హైకోర్టుకు చెందిన ఏడుగురు హైకోర్టు జడ్జిలను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగిన సమావేశాల్లో సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇందులో తెలంగాణ హైకోర్టు నుంచి ఇద్దరు, కర్నాటక హైకోర్టుకు చెందిన నలుగురు, ఏపీ నుంచి ఒకరు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్ పెరుగు శ్రీసుధ కర్నాటకకు, జస్టిస్ కాసోజు సురేందర్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కుంభజడల మన్మథరావు కర్నాటక హైకోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కర్నాటక హైకోర్టుకు చెందిన జస్టిస్ హేమంత్ చందన్ గౌడర్ మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ కృష్ణన్ నటరాజన్ కేరళ హైకోర్టుకు, జస్టిస్ నెర నహళ్లి శ్రీనివాసన్ సంజయ్ గౌడ గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద్ ఒడిశా హైకోర్టుకు కోలిజియం బదిలీ చేసింది.