- టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా
నిజామాబాద్, వెలుగు : భవిస్యత్ అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్దేనని, ప్రతిభ గలవారు ఉత్యుత్తమ స్థానంలో ఉంటారని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జి (టాస్క్) సీఈవో శ్రీకాంత్ సిన్హా అన్నారు. శుక్రవారం నగరంలోని ఐటీ హబ్లో ఏర్పాటు చేసిన బ్రాంచ్ ఓపెనింగ్ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికా దేశం శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే స్కౌట్ బెటర్ సంస్థ తెలంగాణలోని నిజామాబాద్లో తన రెండో బ్రాంచ్ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.
దీంతో జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. యూత్కు ఏఐపై ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు ఈ సంస్థ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందన్నారు. అనంతరం ఐటీ హబ్లో ఉద్యోగాలు సాధించిన 30 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందించి అభినందించారు. కార్యక్రమంలో స్కౌట్బెటర్ సంస్థ ప్రతినిధులు రక్షిత్, రాఘవ్, టాస్క్డెలిగేట్స్ శ్రీనాథ్రెడ్డి, రఘుతేజ, హన్మంత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.