
- నివేదికపై త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్న హైడ్రా కమిషనర్
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) చెరువులపై హైడ్రాకు రిపోర్ట్ ను అందజేసింది. హైడ్రా కమిషన్ ఎవి. రంగనాథ్ కు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి పలు సూచనలతో కూడిన రిపోర్టును సమర్పించారు. డాక్టర్బిక్షం గుజ్జ, డా.కె.శివకుమార్, శ్రవణ్కుమార్సహకారంతో రిపోర్ట్ ను అందజేశారు. దీనిని తెలంగాణ సమాజానికి పుస్తక రూపంలో అందించనున్నట్టు టీడీఎఫ్అమెరికా మాజీ ప్రెసిడెంట్ గాదె గోపాల్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోని 46,500 నీటి వనరుల గురించి ఈ రిపోర్ట్లో వివరంగా పొందుపరిచామని చెప్పారు. హైదరాబాద్ తో సహా 4 జిల్లాలకు సంబంధించి 1042 చెరువుల డీటెయిల్డ్రిపోర్ట్ నుకమిషనర్కు సమర్పించామని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్రంగనాథ్మాట్లాడుతూ.. రిపోర్ట్పై వచ్చే వారం రిటైర్డ్ఇంజినీర్లు, టీడీఎఫ్ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ఇండియా మాజీ చైర్మన్ బద్దం రణధీర్ పాల్గొన్నారు.