టీచర్ వేధింపులు..స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన టెన్త్ విద్యార్థిని

టీచర్ వేధింపులు..స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన టెన్త్ విద్యార్థిని

వికాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.  టీచర్ వేధింపులతో బిల్డింగ్ పైనుంచి దూకింది ఓటెన్త్ విద్యార్థిని. ఫిబ్రవరి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 ఫిబ్రవరి 24 తేదీన వికారాబాద్ జిల్లా కొత్తగాడి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్  బిల్డింగ్ లోని మొదటి అంతస్తు పై నుంచి దూకింది పదో తరగతి విద్యార్థిని తబిత.  ఈ ఘటనలో విద్యార్థిని కాలు విరిగిపోయింది. ఎవరికి చెప్పొద్దని గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించింది హాస్టల్ సిబ్బంది. ఎవరికైనా చెబితే ఎగ్జామ్స్ రాయనివ్వబోమని  ఉపాధ్యాయులు భయబ్రాంతులకు గురిచేశారు.   

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు విద్యార్థి సంఘాలు స్కూల్ బయట ఆందోళనకు దిగాయి.