శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంట ర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తుతెలియని టెర్రరిస్టులు హతమయ్యారు. అలాగే, ఒక ఆఫీసర్ సహా ఐదుగురు భద్ర తా సిబ్బంది గాయపడ్డారని పోలీసు లు తెలిపారు. శని వారం కుల్గాం జిల్లాలోని దేవ్సర్ ప్రాంతంలో గల ఆది గామ్ గ్రామంలో శనివారం తెల్లవారు జామున భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న టెర్రరిస్టులు కా ల్పులు జరిపారు.
ఈ ఘటనలో బుల్లెట్ తగి లి అదనపు పోలీ సు సూపరింటెండెంట్ (ట్రాఫిక్) ముంతాజ్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే భద్రతా దళాలు తిరిగి కాల్పులు ప్రారంభిచగా ఇద్దరు టెర్రరిస్టులు చనిపో యారు. అలాగే, నలుగురు భద్రతా సిబ్బంది కూడా గాయప డ్డారని అధికారు లు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.