
హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్సెట్కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకూ 48,158 మంది అప్లై చేసుకున్నట్టు ఎప్సెట్ కన్వీనర్ దీన్ కుమార్ తెలిపారు. దీంట్లో ఇంజినీరింగ్ స్ర్టీమ్ కు 31,805 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ కు 16,317 మంది, రెండింటికీ 36 మంది అప్లై చేసుకున్నట్టు చెప్పారు. కాగా, ఈ నెల 1 నుంచి ఎప్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.