ఇస్మార్ట్ మూడో పాటకు ముహూర్తం

ఇస్మార్ట్ మూడో పాటకు ముహూర్తం

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్య థాపర్ హీరోయిన్.  సంజయ్ దత్ విలన్‌‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. తాజాగా మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ వర్షా కాలంలో రాబోతున్న రొమాంటిక్ సాంగ్ ఇదని,  జులై 29న పాట విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో రామ్, కావ్య థాపర్.. ఒకరినొకరు హత్తుకుని కనిపిస్తున్నారు. శనివారం సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రంలో అలీ, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఐదేళ్ల క్రితం రామ్, పూరి జగన్నాథ్  కాంబినేషన్‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌ శంకర్‌‌‌‌’కి ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు పెరిగాయి.