
- ముగ్గురు అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: మినీ లారీలో నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న ముగ్గురిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కర్నూలుకు చెందిన ఆలూరు మాదన్న కర్నాటక గజేంద్ర గాడలోని జిన్నింగ్ మిల్లు నుంచి కాటన్విత్తనాలను సేకరిస్తున్నాడు. వాటికి రంగులు కలిపి, రైతులకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు కర్నాటకు చెందిన వాహనంలో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో మల్లంపేటవద్ద పోలీసులు తనిఖీ చేశారు.
నిందితులను నుంచి రూ.17.50 లక్షల విలువైన 700 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మాదన్నతోపాటు లారీ డ్రైవర్ఆదర్శ్, క్లీనర్ గొల్ల ఉదయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మాదన్నపై గతంలో సైతం నకిలీ విత్తనాల కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.