జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డిటౌన్, వెలుగు :  జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్​ జర్నలిస్టుల  ఫెడరేషన్​ ( టీడబ్ల్యూజేఎఫ్​) స్టేట్​ ప్రెసిడెంట్ మామిడి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం  కామారెడ్డి జిల్లా మహాసభ కన్వీనర్ కృష్ణమాచారి అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ రేవంత్​రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిందని, అయినప్పటికీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు.

 సమస్యలు పరిష్కరించే విషయంలో ఇంకా నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదన్నారు. అక్రిడేషన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. రాష్ర్టవ్యాఫ్తంగా ఫెడరేషన్​కు జర్నలిస్టుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు.  ఒక వైపు యాజమాన్యాలు పట్టించుకోకపోగా మరో వైపు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేట్​ వైస్​ ప్రెసిడెంట్లు బండి విజయ్​కుమార్,  తాటికొండ  కృష్ణ, సెక్రెటరీ గండ్ర  నవీన్​లు మాట్లాడుతూ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు జర్నలిస్టులను విస్మరించాయన్నారు. 

ఇండ్ల స్థలాలు రాకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, ఈ ప్రభుత్వమైనా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్​గా  ప్రవీణ్​​గౌడ్,  సెక్రటరీగా కరుణాకర్, వైస్​ ప్రెసిడెంట్లుగా జమాల్​పూర్​ లక్ష్మణ్,  తిరుపతిరెడ్డి, రాకేశ్,   జాయింట్​ సెక్రటరీలుగా సంజీవ్,  లింగం,  ట్రెజరర్​గా పి.రాములు,  కార్యవర్గ సభ్యులుగా స్వాతి,  బల్వంత్​రావు,  రామ 

ఎన్నికయ్యారు.