బ్లాక్​లో ఐపీఎల్​ టికెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్

బ్లాక్​లో ఐపీఎల్​ టికెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​స్టేడియం వద్ద బ్లాక్​లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు అమ్ముతున్న ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్​వేదికగా సన్​రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్​రాయల్స్​మ్యాచ్​జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్​కు సంబంధించిన టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. టికెట్లు దొరకని చాలా మంది స్టేడియం వద్దకు వస్తున్నారు. 

డిమాండ్​ను క్యాష్​చేసుకునేందుకు కొందరు బ్లాక్​లో ఐపీఎల్​టికెట్లు విక్రయిస్తున్నారు. శనివారం స్టేడియం వద్ద బ్లాక్​టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్, సంపత్​అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రాజస్థాన్​మ్యాచ్​కు చెందిన 4 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని ఉప్పల్​పోలీసులకు అప్పగించారు. కేసు నమోదైంది.