నాచినపల్లిలో మొక్కజొన్న చేనుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

నాచినపల్లిలో మొక్కజొన్న చేనుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

నల్లబెల్లి, వెలుగు: మొక్కజొన్న చేనుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన వరంగల్​జిల్లాలో జరిగింది.  గ్రామస్తులు తెలిపిన ప్రకారం..  దుగొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన రైతు ఇజ్జిగిరి సదయ్య 4 ఎకరాల్లో మొక్కజొన్న చేను వేశాడు.  సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలి బూడిదైందని బాధిత రైతు వాపోయాడు.

 రూ. లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్టు తెలిపాడు. కష్టమంతా బూడిడ పాలైందని బోరున విలపించాడు. నర్సంపేట ఫైర్ స్టేషన్​కు సమాచారం అందించగా వచ్చి మంటలను ఆర్పుతున్నట్టు చెప్పాడు.