
- వేములవాడ రాజన్న ఆలయంలో
- మరోసారి తలనీలాల వేలం పాట
- రూ. 14 .01 కోట్లకు పాడిన సికింద్రాబాద్ కళావతి ఎంటర్ ప్రైజెస్
- నివేదికను ఎండోమెంట్ కమిషనర్ కు పంపిన ఆలయ అధికారులు
వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తలనీలాల టెండర్ ధర మరోసారి ఆశించిన స్థాయిలో రాలేదు. రెండేండ్ల కింద టెండర్ రూ. 19. 08కోట్లకు పాడగా.. ఈసారి రూ. 6 కోట్లు తగ్గించి ఆలయ అధికారులు వేలం వేశారు. అయినా.. కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. గురువారం ఆలయ ఓపెన్స్లాబ్లో తలనీలాల టెండర్వేలం పాట వేశారు. ముందుగా రూ. 13.70 కోట్లతో అధికారులు వేలం ప్రారంభించారు. సికింద్రాబాద్ కు చెందిన వల్లభ ఎంటర్ప్రైజెస్ రూ. 14 కోట్లకు, కళావతి ఎంటర్ప్రైజెస్రూ.14. 01 కోట్లకు వేలం పాడాయి. దీంతో టెండర్వివరాలను స్టేట్ ఎండోమెంట్కమిషనర్ కు నివేదిక పంపినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కాగా.. ఈనెల11న వేలంలో తమిళనాడుకి చెందిన దురై ఎంటర్ ప్రైజెస్రూ.13.67 కోట్లకు ఆన్ లైన్ లో టెండర్ వేసింది. కానీ దక్కించుకోలేదు. మరోసారి అదే టెండర్ పాటపై అదనంగా 30 లక్షలు పెంచి పాడారు. కాగా.. కాంట్రాక్టర్లలంతా రింగ్ అయి టెండర్ను తగ్గిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు టెండర్లలో పాల్గొనకుండా తగ్గించేందుకు దేవాదాయ శాఖ అధికారులు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వేలం పాటలో ఈఓ వినోద్ రెడ్డి, ఏఈఓ శ్రవణ్కుమార్, ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ ఉన్నారు.