
- డొనేట్ చేసిన వాఘ్బక్రీ ఫౌండేషన్
వాఘ్బక్రీ ఫౌండేషన్ ప్రత్యేకంగా తయారు చేయించిన తొమ్మిది ఫుడ్డెలివరీ వెహికల్స్ ను అక్షయ పాత్ర ఫౌండేషన్కు విరాళంగా అందజేసింది. వీటితో హైదరాబాద్, నెల్లూరు ప్రాంతాల్లో 205కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లోని 10,500 మంది స్టూడెంట్లకు భోజనాన్ని అందించే ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్మాట్లాడుతూ అక్షయ పాత్ర ఫౌండేషన్తెలంగాణలో రోజుకు 1,76,073, ఏపీలో 1,44,732 మంది స్టూడెంట్లకు భోజనాలు అందిస్తోందని, వాఘ్బక్రీ ఫౌండేషన్ అందిస్తున్న నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. వాఘ్బక్రీ టీ గ్రూప్సీఈఓ సంజయ్సింగల్ మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్భాగస్వామ్యంతో వేలాది మంది విద్యార్థులకు సేవ చేసే అవకాశం కలిగిందన్నారు.