
గ్రేటర్ వరంగల్, వెలుగు: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లను కేటాయించాలని ఆదివారం వరంగల్ఏసీపీ నందిరామ్ నాయక్కు వరంగల్ తూర్పు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలతో పాటు నిరాహార దీక్షలు చేపడుతున్న క్రమంలో పర్మిషన్ కోసం వరంగల్ ఏసీపీకి వినతిపత్రం అందజేశామన్నారు. కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులు పాల్గొన్నారు.