యమహా జీపీ ఎడిషన్ ​బండ్లు వచ్చేశాయ్​

యమహా జీపీ ఎడిషన్ ​బండ్లు వచ్చేశాయ్​

యమహా ఇండియా ఆర్​15ఎం,  ఎంటీ15 వెర్షన్ బండ్లకు 2024 మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ ఎనర్జీ మోటో జీపీ ఎడిషన్ మోడల్స్​ను విడుదల చేసింది. ఈ లిమిటెడ్​ ఎడిషన్ మోడల్స్​ యమహా బ్లూ స్క్వేర్ షోరూమ్స్​లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.  రెండు బైకుల్లోనూ  155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.  

డ్యూయల్- ఛానల్ ఏబీఎస్​, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్లిప్  అసిస్ట్ క్లచ్, వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆర్​15ఎం  ఎంటీ15 వెర్షన్ 2.0 ధరలు వరుసగా రూ. 1,98,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ),  రూ. 1,73,400 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.