
మాదాపూర్, వెలుగు : బ్లడ్ క్యాన్సర్పై పోరాడేందుకు మానసిక బలం, ఆర్థిక మద్దతు, సమాజ అవగాహన అవసరమని యశోద గ్రూప్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్.జి.ఎస్.రావు అన్నారు. మాదాపూర్ యశోద హాస్పిటల్లో శనివారం డెక్కన్ హెమటోలింక్ 2.O పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స, పేషెంట్ కేర్ లో వచ్చిన తాజా పురోగతులపై చర్చించారు. డాక్టర్జి.ఎస్.రావు మాట్లాడుతూ దేశంలో బ్లడ్ క్యాన్సర్పేషెంట్ల సంఖ్య నానాటికి పెరుగుతుందన్నారు.
గ్లోబోకాన్ 2020 నివేదికల ప్రకారం.. ఏటా 1.3 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. లుకేమియా, లింఫోమా, మైలోమాతో సహా బ్లడ్ క్యాన్సర్లు పెరుగుతూనే ఉన్నాయన్నారు. డాక్టర్గణేష్ జైషేత్వర్ తోపాటు 200 మందికిపైగా జాతీయ, 10 మందికిపైగా అంతర్జాతీయ ఆంకాలజీ, హెమటో-ఆంకాలజీ వైద్య నిపుణులు పాల్గొన్నారు.