ఉజ్వల పథకం కింద 10 కోట్ల మంది మహిళలకు లబ్ధి పొందారు

ఉజ్వల పథకం కింద 10 కోట్ల మంది మహిళలకు లబ్ధి పొందారు
  • ఎల్​పీజీతో పేదల జీవితాల్లో వెలుగులు
  • కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

కంటోన్మెంట్, వెలుగు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉజ్వల పథకం కింద 10 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఎల్​పీజీతో పేదల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు.  హైదరాబాద్​లో ఆదివారం జరిగిన తెలంగాణ ఎల్​పీజీ డిస్ట్రిబ్యూటర్ల సమ్మిట్​లో ఆయన పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాలకు ఎల్​పీజీ అందించడంతో డిస్ట్రిబ్యూటర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో గ్యాస్ రంగంలో  సమర్థవంతంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మరింత సాంకేతికతను వినియోగించనున్నట్లు చెప్పారు.