ఎల్​ బీ నగర్ లో ఆర్​టీఏ అధికారుల తనిఖీ.. 10 స్కూల్​ వ్యాన్లు సీజ్

ఎల్​ బీ నగర్ లో ఆర్​టీఏ అధికారుల తనిఖీ.. 10 స్కూల్​ వ్యాన్లు సీజ్

ఎల్బీనగర్, వెలుగు: పెద్ద అంబర్​పేటలో గురువారం స్కూల్ వ్యాన్ ఢీకొని చిన్నారి మృతి చెందడంతో సిటీ శివారులోని ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం వనస్థలిపురంలో తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి పిల్లలను కుక్కి, పొల్యూషన్, ఫిట్​నెస్​సర్టిఫికెట్లు లేకుండా నడుస్తున్న 10 స్కూల్​వ్యాన్లను సీజ్ చేశారు. మంగళ్ పల్లి వద్ద గ్లోబల్ వికాస్ లీడర్ షిప్ స్కూల్ వ్యాన్ ను ఆపి తనిఖీచేయగా అందులో 57 మందిని ఎక్కించి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒకే బస్సులో వేర్వేరు స్కూల్​స్టూడెంట్లు ఉన్నారు. తనిఖీల్లో ఆర్టీఏ ఆఫీసర్​ షేక్ ముని పాల్గొన్నారు.