తెలంగాణ‌లో 4234 టెస్టులు.. 1018 మందికి క‌రోనా పాజిటివ్

తెలంగాణ‌లో 4234 టెస్టులు.. 1018 మందికి క‌రోనా పాజిటివ్

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 4,234 టెస్టులు చేయ‌గా.. 1018 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. తాజా కేసుల‌తో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 17,‌357కి చేరింది. అలాగే ఒక్క రోజులో ఏడుగురు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 267కి పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 788 మంది క‌రోనా నుంచి కోలుకోవ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 8082కి చేరింది. ప్ర‌స్తుతం 9008 మంది చికిత్స పొందుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా ‌గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 881 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మేడ్చ‌ల్‌లో 36 మందికి, రంగారెడ్డి జిల్లాలో 33 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.