ఏపీలో మ‌రో 1062 క‌రోనా కేసులు

ఏపీలో మ‌రో 1062 క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌న కొన‌సాగుతోంది. ప్ర‌తి రోజూ భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1062 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. తాజాగా న‌మోదైన కేసుల్లో 1051 మంది లోక‌ల్స్ కాగా, విదేశాల నుంచి వ‌చ్చిన వారిలో ఇద్ద‌రు, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారు 9 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 22,259కి చేరింది.

గ‌డిచిన 24 గంట‌ల్లో 12 మంది క‌రోనాతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. క‌ర్నూలులో ముగ్గురు, అనంత‌పురం, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా జిల్లాలో ఇద్ద‌రు చొప్పున‌ మ‌ర‌ణించారు. గుంటూరు, చిత్తూరు, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో ఒక్కొక్క‌రు చొప్పున క‌రోనా కార‌ణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 264కి పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా నుంచి కోలుకుని 11,101 మంది ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 10,894 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా క‌రోనా కేసుల వివ‌రాలు