సైబరాబాద్​లో​107 మందికి సర్వీస్​ మెడల్స్

సైబరాబాద్​లో​107 మందికి సర్వీస్​ మెడల్స్

గచ్చిబౌలి, వెలుగు: ప్రజా భద్రత, నేరాల నివారణలో అంకితభావం, సమగ్రతకు గుర్తుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించడానికి సేవా పతకాలను అందజేస్తున్నాయని సైబరాబాద్​ సీపీ అవినాష్ ​మహంతి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కమిషనరేట్​లోని107 మంది సిబ్బందికి  ప్రభుత్వం 76 కాంస్య పతకాలు, అతి ఉత్కృష్ట సేవా పతక్​ కేటగిరిలో 4 బంగారు పతకాలు,  ఉత్కృష్ట సేవా పతక్​ కింద 27 వెండి పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిని శుక్రవారం కమిషనరేట్​ ఆఫీస్​లో సీపీ అందజేశారు. కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

ప్రిజం పబ్​కాల్పుల ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లకు రివార్డులు

గచ్చిబౌలి ప్రిజం పబ్​వద్ద జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ మాదాపూర్ ​సీసీఎస్​ హెడ్​కానిస్టేబుల్​ వెంకట్​రెడ్డి కోలుకున్నారు. ధైర్యంగా కరుడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్​ను పట్టుకున్న హెడ్ ​కానిస్టేబుల్​ వెంకట్​రెడ్డితోపాటు కానిస్టేబుళ్లు ప్రవీణ్​రెడ్డి, వీరస్వామిని శుక్రవారం సైబరాబాద్​ సీపీ అవినాష్ ​మహంతి అభినందించారు. తన కార్యాలయంలో ముగ్గురికి రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో సైబరాబాద్​ క్రైమ్​డీసీపీ నర్సింహా, ఇతర అధికారులు పాల్గొన్నారు.