స్కూల్ కు వెళ్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన టెన్త్ విద్యార్థి

స్కూల్ కు వెళ్తుండగా  గుండెపోటుతో కుప్పకూలిన టెన్త్ విద్యార్థి

ఈ మద్య గుండెపోట్లు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఎపుడు ఎవరికి వస్తుందో అర్థం కావట్లే..కూర్చున్న చోటనే కుప్పకూలుతున్నారు. 

లేటెస్ట్ గా గుండెపోటుతో టెన్త్​క్లాస్​ స్టూడెంట్ ​మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.  రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి కామారెడ్డిలో ప్రైవేటు స్కూల్​లో టెన్త్​క్లాస్​ చదువుతుంది.  ఈ క్రమంలో ఫిబ్రవరి 20న స్కూల్​కు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకులింది.

పాఠశాల ఉపాధ్యాయుడు,  పేరెంట్స్​ ఆమెను హాస్పిటల్​కు తరలించే లోపే మార్గమధ్యంలోనే  చనిపోయిన్నట్లు డాక్టర్లు తెలిపారు.  హాస్పిటల్​లో ఆమెకు సీపీఆర్​చేసిన ఫలితం లేకపోయింది.  స్టూడెంట్​మృతిపై గ్రామంలో  విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని మృతి పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.