సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలోని 11 మంది ఇన్​స్పెక్టర్లు బదిలీ

 సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలోని 11 మంది ఇన్​స్పెక్టర్లు బదిలీ

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలోని11 మంది ఇన్​స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్​ మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమన్​గల్​సీఐగా పనిచేస్తున్న ప్రమోద్​కుమార్​ను ఆర్జీఐ ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​గా, ఆర్జీఐ ట్రాఫిక్​ఇన్​స్పెక్టర్​గా ఉన్న కారంపురి రాజును శామీర్​పేట డీఐగా బదిలీ చేశారు. జగద్గిరిగుట్ట డీఐ అంజయ్యను  రాజేంద్రనగర్​జోన్​ఎస్ఓటీ ఇన్​స్పెక్టర్​గా, శామీర్​పేట డీఐ చంద గంగాధర్ ను కడ్తాల్​ఇన్​స్పెక్టర్​గా, పేట్​బషీరాబాద్​ఇన్​స్పెక్టర్​సుంకరి విజయ్ ను చందానగర్​ ఇన్​స్పెక్టర్​గా, కడ్తాల్​ఇన్​స్పెక్టర్​శివ ప్రసాద్ ను సైబర్​క్రైమ్​ఇన్​స్పెక్టర్​గా ట్రాన్స్​ఫర్​చేశారు. రాజేంద్రనగర్​ ఎస్ఓటీ ఇన్​స్పెక్టర్​రమనారెడ్డిని షీ టీం ఇన్​స్పెక్టర్​గా, సైబర్ క్రైమ్​ఇన్​స్పెక్టర్​అజయ్​కుమార్ ను పేట్​బషీరాబాద్​డీఐగా, చందానగర్​ఇన్​స్పెక్టర్ పాలవెల్లిని సైబర్​ క్రైమ్​ ఇన్​స్పెక్టర్​గా, సైబర్​ క్రైమ్​ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న నరేందర్​రెడ్డిని జగద్గిరిగుట్ట డీఐగా బదిలీ చేశారు. తక్షణమే ఆయా పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.