![3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు](https://static.v6velugu.com/uploads/2025/02/118-people-have-filed-nominations-for-3-mlc-seats-in-telangana-state_0qECXebOnu.jpg)
- కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్ స్థానానికి 15
- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్
- ముగిసిన గడువు.. చివరిరోజు పోటెత్తిన అభ్యర్థులు
- ఈ నెల 27న పోలింగ్.. వచ్చే నెల 3న కౌంటింగ్
కరీంనగర్/ నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 118 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ‘కరీంనగర్’ గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ‘నల్గొండ’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఈ నెల 3న నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చివరి గడువు పూర్తయింది. గడువు ముగిసే సమయానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 80, టీచర్స్ ఎమ్మెల్సీలకు 38 మంది నామినేషన్ వేసినట్టు అధికారులు తెలిపారు. కరీంనగర్-–-ఆదిలాబాద్--– నిజామాబాద్--– మెదక్ స్థానాలకు సోమవారం మొత్తం 59 నామినేషన్లు దాఖలవగా..
అందులో 51 నామినేషన్లు గ్రాడ్యుయేట్, 8 నామినేషన్లు టీచర్స్ స్థానానికి వచ్చాయి. మొత్తంగా గ్రాడ్యుయేట్కు 80 మంది 125 సెట్లు, టీచర్ ఎమ్మెల్సీకి 15 మంది 22 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు అభ్యర్థుల అనుచరుల ర్యాలీలతో కరీంనగరం కిక్కిరిసిపోయింది. కలెక్టరేట్ప్రాంగణంలో ఆంక్షల కారణంగా కేవలం అభ్యర్థులనే అనుమతించారు. కాగా, వరంగల్-–ఖమ్మం–నల్గొండ టీచర్ఎమ్మెల్సీకి 23 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం ప్రధాన సంఘాల అభ్యర్థులు నల్గొండలో ర్యాలీ తీశారు.
ఎన్జీ కాలేజీ నుంచి క్లాక్ టవర్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనలు, బైకులు, కార్లతో ర్యాలీలు చేపట్టారు. ఈ నెల13న మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చాన్స్ ఉంది. ఈ నెల 27న పోలింగ్ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.