
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని ఆంధ్రా బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో 12 మందిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. సీఐ కట్టా నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్నగర్ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్లో 15 కంపెనీలకు చెందిన వ్యక్తులు 2016లో బిజినెస్లోన్లు తీసుకున్నారు. లోన్ల ష్యూరిటీ కింద బ్యాంకులో పెట్టిన ప్రాపర్టీల విలువలు ఎక్కువ చూపించారు.
కొన్నింటికి సరైన పత్రాలు లేకపోయినా అప్పటి మేనేజర్ రూప, మరో ఇద్దరు సిబ్బంది లోన్లు తీసుకున్న వారికి సహకరించారు. మొత్తంగా దాదాపు రూ.27 కోట్ల లోన్లను వారికి ఇప్పించారు. 2021లో ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంక్గా మారడంతో ఆడిట్లో భాగంగా ఈ లోన్ వ్యవహారం బయటపడింది. దీంతో సంబంధిత అధికారులు ఆర్సీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి మంగళవారం లోన్ఫ్రాడ్తో సంబంధం ఉన్న 12 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.