
మెహిదీపట్నం, వెలుగు: మంగళ్ హాట్ చిస్తి చమాన్లోని ఓ నాన్ వెజ్ షాపులో ఫ్రిడ్జ్లో స్టోర్చేసిన 12 టన్నుల మేక మాంసాన్ని ఫుడ్సేఫ్టీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ సర్కిల్–14 ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు.
మహమ్మద్ అప్రొజ్ (40)అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజులుగా ఫ్రిడ్జ్లో స్టోర్చేసిన పాయ, తలకాయ, మెదడు, మూత్రపిండం, మేకలు, గొర్రెల కాలేయం కలిసి సుమారు 12 టన్నుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 8 లక్షలు ఉంటుందని తెలిపారు. ఫ్రిడ్జ్లో స్టోర్చేసి తక్కువ ధరకు హోటళ్లు, ఫంక్షన్లకు సప్లై చేస్తున్నట్లు వివరించారు.