తెలంగాణలో 13 మంది ఐఏఎస్‎ల బదిలీ

తెలంగాణలో 13 మంది ఐఏఎస్‎ల బదిలీ

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్‎ల బదిలీలు జరిగాయి. సోమవారం (అక్టోబర్ 28) 13 మంది ఐఏఎస్‎లను ప్రభుత్వం ట్రాన్స్‎ఫర్  చేసింది. నల్గొండ కలెక్టర్‌గా త్రిపాఠి, రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి, యాదాద్రి కలెక్టర్‌గా హనుమంతరావు, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌గా టీకే శ్రీదేవి, సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా మందా మకరందు, ఐ అండ్ పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌గా ఎస్‌.హరీష్‌, నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా దిలీప్‌కుమార్, పర్యాటక శాఖ సంచాలకులుగా జెడ్.కే హనుమంతు, రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్‎గా శశాంక, విపత్తు నిర్వహణ సంయుక్త  కార్యదర్శిగా హరీష్‎కు అదనపు బాధ్యతలు.. ఆర్ అండ్ ఆర్, భూసేకరణ కమిషనర్‎గా వినయ్ కృష్ణారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‎గా నిఖిల్ చక్రవర్తి, డెయిరీ కార్పొరేషన్ ఎండీగా కే.చంద్రశేఖర్ రెడ్డిలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు 2024, అక్టోబర్ 28న సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

ALSO READ : తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో భారీగా బదిలీలు : 70 మంది అధికారుల ట్రాన్సఫర్లు