
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్మెట్రో మరోసారి గ్రీన్చానెల్ ద్వారా గుండెను తరలించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. శుక్రవారం రాత్రి 9.16 గంటల సమయంలో ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి రసూల్ పురాలోని కిమ్స్ హాస్పిటల్ వరకు ప్రత్యేక రైల్ఏర్పాటు చేశారు.
డాక్టర్ల పర్యవేక్షణలో కేవలం 12 నిమిషాల్లోనే 13 కి.మీ దూరంలోని హాస్పిటల్చేరుకున్నారు. 11 మెట్రో స్టేషన్లు దాటి గుండెను విజయవంతంగా చేర్చారు. జీవన్ దాన్ద్వారా గుండెను సేకరించి ఓ వ్యక్తికి అమర్చారు.
అవయవాల తరలింపులో మెట్రో కీలక పాత్ర పోషిస్తున్నది. గత జనవరి17 మెట్రో గ్రీన్ చానెల్ ద్వారా ఇదే కామినేని హాస్పిటల్ నుంచి లక్డీకాపూల్ గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ కు గుండెను తరలించారు.