
నర్సంపేట, వెలుగు: విద్యుత్ షాక్తో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సంపంగి రాకేశ్(14) చనిపోయాడు. స్థానిక హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. సెకండ్ సాటర్డే కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. సెల్ఫోన్కు చార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో చనిపోయాడు. రాశేక్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.