
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలోని రెండు చోట్ల 15 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లు చిక్కాయి. చేవెళ్ల పరిధిలోని ఫామ్హౌజ్లో పర్మిషన్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి పార్టీ నిర్వహిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్అధికారులకు సమాచారం అందింది. ఏసీ రంగారెడ్డి టీమ్ రైడ్ చేసి 7 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది.
ఫామ్హౌజ్యజమానిని చేవేళ్ల పోలీసులకు అప్పగించినట్లు అసిస్టెంట్కమిషనర్ ఆర్.కిషన్ తెలిపారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఘట్కేసర్లో విక్రయిస్తున్న 8 లిక్కర్బాటిళ్లను ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ పట్టుకుంది. నిందితుడు లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేసి ఘట్కేసర్ఎక్సైజ్ పోలీసులకు అప్పగించింది.