
- అరగంట పాటు 15 మంది నరకయాతన
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆసుపత్రిలోని లిఫ్ట్మధ్యలో ఆగిపోవడంతో 15 మంది అరగంటపాటు నరకయాతన అనుభవించారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు మెయిన్బిల్డింగ్లోని ఆరో ఫ్లోర్ కు వెళ్లేందుకు గ్రౌండ్ఫ్లోర్లో 15 మంది నాలుగో నంబర్లిఫ్ట్ఎక్కారు. వీరిలో14 మంది అటెండెంట్లు, ఒక పేషెంట్ఉన్నారు. కాగా ఐదు, ఆరు ఫ్లోర్ల మధ్య లిఫ్ట్స్ట్రక్అయింది. దీంతో లోపలున్న 15 మంది తీవ్ర ఆందోళన చెందారు.
పలుమార్లు అలారమ్బటన్నొక్కడంతో సెక్యూరిటీ గార్డులు గమనించి టెక్నీషియన్ను పిలిపించారు. అరగంట తర్వాత లిఫ్ట్ ఆరో ఫ్లోర్కు చేరుకుని డోర్లు తెరుచుకున్నాయి. 15 మంది ‘దేవుడా.. బతికిపోయాం..’ అంటూ బయటపడ్డారు. లిఫ్ట్ ఆపరేటర్లను నియమించాలని, ఎప్పటికప్పుడు సర్వీసింగ్చేయించాలని పేషెంట్లు, అటెండెంట్లు కోరుతున్నారు.