ఇ-కోర్టులకు రూ.1,500 కోట్లు

ఇ-కోర్టులకు రూ.1,500 కోట్లు

 న్యూఢిల్లీ: ఇ–కోర్టుల ప్రాజెక్టు థర్డ్​ఫేజ్​కోసం కేంద్రం రూ.1,500కోట్లు కేటాయించింది. గతేడాది సెప్టెంబర్​లో రూ.7,210 కోట్ల అంచనాతో మూడో దశను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. అన్ని కోర్టుల రికార్డులను, పెండింగ్​కేసుల వివరాలను డిజిటలైజ్​చేయడానికి ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది. నేషనల్​ఇ–గవర్నెన్స్​ప్లాన్​లో భాగంగా 2007 నుంచి ఇ–కోర్టుల ప్రాజెక్టు అమలులో ఉంది. గతేడాది రెండో దశ ముగిసింది. మూడో దశ పూర్తయితే వర్చువల్​కోర్టుల పరిధిని పెంచేందుకు అవకాశం లభిస్తుంది.