
యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు రోజుల్లో రూ.15.35 కోట్ల మద్యం తాగేశారు. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో జిల్లాలోని 82 వైన్షాపుల్లో మూడు రోజుల్లో ఇంత మొత్తం లిక్కర్సేల్అయింది. భువనగిరి పరిధిలో రూ.5.55 కోట్లు, రామన్నపేట పరిధిలో రూ.3.57కోట్లు, ఆలేరు పరిధిలో రూ.3.66 కోట్లు, మోత్కూరు పరిధిలో రూ.2.57 కోట్ల లిక్కర్సేల్అయింది.