లోక్​ అదాలత్​లో 1,563 కేసులు పరిష్కారం

లోక్​ అదాలత్​లో 1,563 కేసులు పరిష్కారం

మెదక్ టౌన్, వెలుగు: మెదక్​ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్​ అదాలత్​లో 1,563 కేసులను పరిష్కరించి, బాధితులకు రూ.2,12,67,784 చెల్లించారు. శనివారం మెదక్​ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్​పర్సన్​, జిల్లా జడ్జి లక్ష్మీశారద ఆధ్వర్యంలో లోక్​ అదాలత్​నిర్వహించారు. 

ఈ సందర్భంగా యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం, ఇన్సూరెన్స్ అమౌంట్ చెల్లించారు. అలాగే పీఎల్​సీ బ్యాంకు రికవరీ, భార్యాభర్తల కేసులు, క్రిమినల్, సివిల్​ కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో కక్షిదారులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్​అధికారులు పాల్గొన్నారు.