
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ఆర్టీసీ డిపోకు ప్రభుత్వం 16 కొత్త బస్సులను కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్ విజ్ఞప్తి మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్కొత్త బస్సులను అలాట్చేశారు.
మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని, అనుగుణంగా మరిన్ని బస్సులు కావాలని కోరగా ఈ మేరకు కేటాయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
షాద్నగర్డిపోకు 18 బస్సులు
షాద్నగర్: తన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం షాద్నగర్డిపోకు 18 కొత్త బస్సులు కేటాయించిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. త్వరలోనే షాద్ నగర్ డిపోలో సిబ్బంది కొరత తీరుతుందన్నారు.