
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,657 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,52,955కి చేరింది. ఇందులో 19,757 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,26,344 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ఏడుగురు మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,854కు చేరుకుంది. ఇక నిన్న 2,155 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,26,344కి చేరింది.
జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు.. అనంతపురం 80, చిత్తూరు 184, తూర్పుగోదావరి 252, గుంటూరు 194, కడప 71, కృష్ణా 225, కర్నూలు 19, నెల్లూరు 62, ప్రకాశం 86, శ్రీకాకుళం 74, విశాఖపట్నం 95, విజయనగరం 66, పశ్చిమ గోదావరి 249 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,302కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 806 మంది కరోనాతో మరణించారు.