
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1673 పీవో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: మొత్తం 1673 పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్- 1600, బ్యాక్లాగ్- 73 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు బేసిక్ పే రూ.41,960 చెల్లిస్తారు.
సెలెక్షన్: ఫేజ్1-ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3 -సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్లైన్లో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష 17, 18, 19, 20 డిసెంబర్లో నిర్వహిస్తారు. మెయిన్స్ 2023వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఫేజ్-3 సైకోమెట్రిక్ టెస్టులు, ఇంటర్వ్యూలు ఫిబ్రవరి/మార్చిలో ఉంటాయి.
పూర్తి వివరాలకు www.sbi.co.in వెబ్సైట్ సంప్రదించాలి.